మేడిపల్లి మండలం పర్వత పూర్ లోని సాయిప్రియ నగర్ ప్లాట్లను జీఓ 118 కింద రెగ్యులరైజ్ చేయాలని వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కోరారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం సోమాజిగూడలో వారు సమావేశం అయ్యారు. గత 30 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన ప్లాట్లు తమవి కావని గెంటేసి ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.