మాజీ డీసీపీ రాధాకిషన్ పై మరో కేసు నమోదు

63చూసినవారు
కూకట్పల్లి పీఎస్ లో మాజీ డీసీపీ రాధా కిషన్ రావుపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో అపార్ట్మెంట్లో వ్యాపారం చేస్తున్న మునగపాటి సుదర్శన్ ను బెదిరించిన కేసులో కేసు నమోదైనట్లు సీఐ కృష్ణమోహన్ తెలిపారు. రాజు, విశ్వనాథ్ అనే వ్యక్తులతో చేతులు కలిపి తనపై తప్పుడు కేసులు నమోదు చేశాడని బాధితుడు ఆరోపించారు. సుదర్శన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్