హైదరాబాద్ మాదాపూర్లో ఈడీ సోదాలు ముగిశాయి. కవిత ఆడపడుచు ఇంట్లో శనివారం ఉదయం నుంచి ఈడీ తనిఖీలు చేపట్టింది. 11 గంటల పాటు వివిధ పత్రాలు పరిశీలించిన ఈడీ అధికారులు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత మేనల్లుడు శరణ్ పాత్రపై ఆరా తీశారు. సౌత్ లాబీ డబ్బు లావాదేవీల్లో శరణ్ కీలక పాత్ర ఉన్నట్లు ఈడీ భావిస్తోంది.