కూకట్ పల్లిలోని జె ఎన్ టి యులో హోళీ పండుగ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఏబీవీపీ స్టేట్ టెక్నికల్ సేల్ కన్వీనర్ నాగరాజు అధ్వర్యంలో యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు అందరూ కలిసి హోళీ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వివిధ పాటలకు నృత్యాలు చేస్తూ ఆటపాటలతో సందడి చేశారు. యూనివర్సిటీలో ప్రతి పండుగను విద్యార్థులందరూ ఇలాగే కలిసికట్టుగా జరుపుకుంటామని వారు తెలిపారు.