వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

54చూసినవారు
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
వ్యభిచారం నిర్వహిస్తున్న పలువురిని ఎల్బీనగర్ పోలీసులు మంగళవారం రిమాండ్ కు తరలించారు. గజ్వేల్ గ్రామానికి చెందిన రావిశెట్టి దయాకర్ నగరానికి వచ్చి ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ మన్సూరాబాద్ లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. వివిధ ప్రాంతాల నుంచి మహిళలను తీసుకు వచ్చి తాను నివాసముండే ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు దయాకర్ నివాసంపై దాడి చేసి ఓ మహిళతో పాటు విటుడిని రిమాండ్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్