సైదాబాద్ లో పర్యటించిన మలక్ పేట్ ఎమ్మెల్యే

59చూసినవారు
సైదాబాద్ డివిజన్ లో మలక్ పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల జలమండలి, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి బుధవారం పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా సీవరేజ్ లైన్, విద్యుత్ సరఫరా సమస్యలు ఉన్నాయని స్థానికులు తెలుపగా వెంటనే సమస్యలను పరిష్కరించాల్సిందిగా అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. మరోసారి సమస్యలను పునరావృతం కాకుండా చూడాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్