హస్తినాపురం డివిజన్ లో మల్కాజ్ గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ మంగళవారం పర్యటించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో తనను గెలిపించాల్సిందిగా ఓటర్లను కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు విశ్వసించడం లేదని అన్నారు. మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ది పథంలో నడుస్తుందన్నారు. తనను ఎంపిగా గెలిపిస్తే సమస్యలు లేకుండా చూస్తానన్నారు.