సమస్య ఉన్న ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే

58చూసినవారు
మచ్చ బొల్లారం డివిజన్ పరిధిలోని బొల్లారం రైల్వే అందరి బ్రిడ్జి వద్ద చిన్నపాటి వర్షానికి వరద నీరు నిలిచి ఇబ్బందిగా మారిందని స్థానికుల పిర్యాదు మేరకు గురువారం ఆయా ప్రాంతాలను మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పరిశీలించారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. డ్రైనేజీ లైన్ సిస్టం సరిగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.

సంబంధిత పోస్ట్