ఘట్ కేసర్ పీఎస్ పరిధి ఘనపూర్ లో విషాదం చోటు చేసుకుంది. ఒకేషనల్ కోర్సు అయిన ఎమ్ పి హెచ్2 డబ్ల్యు లో తక్కువ మార్కులు వచ్చాయని మానసిక వేదనతో కాసర్ల స్వప్న (20) అనే విద్యార్థిని చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్వప్న తండ్రి సతీష్ 2009 సంవత్సరంలో ఘట్ కేసర్ మండలం ఘనపూర్ లోని హ్యపీ ఆర్ఫన్ హోంలో స్వప్నను చేర్పించాడు. కాగా గత నెలలో విడుదలైన ఫలితాలలో 1000 మార్కులకు గానూ 700 మార్కులు స్వప్న స్కోర్ చేసింది.