విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

83చూసినవారు
విద్యుత్ షాక్ తో యువకుడు మృతి
విద్యుత్ షాక్ తో యువకుడు మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని నూతనకల్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి వినీత్ (18) తన ఇంటి ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఉన్న ఇనుప రాడును కిందికి తీసుకువస్తుండగా కరెంటు వైర్లకు తాకి విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. ప్రమాదాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానికంగా ఉన్న మెడినోవా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్