అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న శ్రీ చైతన్య స్కూల్ ముందు బడ్జెట్ పాఠశాల యాజమాన్యాలు బుధవారం ధర్నా చేశారు. కుత్బుల్లాపూర్ మండలం సుచిత్ర మూడు గుళ్ళు ఎదురుగా శ్రీ చైతన్య పాఠశాలకు అనుమతులు లేకపోవడంతో మే నెలలో విద్యాశాఖ అధికారులు సీజ్ అయినా పాఠశాల యాజమాన్యం అడ్మిషన్ స్వీకరిస్తున్నారన్నారు. విషయంపై ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి.