బంగారంతో పాటు రెండు గ్యాస్ సిలిండర్లు చోరీ

84చూసినవారు
బంగారంతో పాటు రెండు గ్యాస్ సిలిండర్లు చోరీ
ఘట్కేసర్ మండల్ బ్రూక్ బాండ్ కాలనీకి చెందిన అంకం శారద(65) కంటి వైద్యం కోసం నాలుగు నెలల క్రితం కూతురు ఇంటికి వెళ్ళింది. వైద్యం చేపించుకుని ఆదివారం తిరిగి వచ్చేసరికి దర్వాజా పగలగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా అల్మారాలో పెట్టిన తులం బంగారంతో పాటు, రెండు గ్యాస్ సిలిండర్లు కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్