ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి: లింగంగౌడ్

52చూసినవారు
ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి: లింగంగౌడ్
ఆశా వర్కర్లకు 18 వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 30 వేలమంది ఆశా వర్కర్లు 19 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలు, పేదలకు ఆరోగ్య భద్రత సేవలు అందిస్తున్నారని సోమవారం తెలిపారు. పారితోషకం కాకుండా ఆశాలకు ఫిక్స్డ్ వేతనం రూ. 18 వేలు ఇవ్వాలని పీఎఫ్, ఈ ఎస్ ఐ సౌకర్యం కల్పించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్