రాంనగర్ యువ హీరోలకు మేయర్ సన్మానం

80చూసినవారు
భారీ వర్షం, వరదలో ముషీరాబాద్ పరిధి రాంనగర్లో రిస్క్ చేసి నలుగురిని కాపాడిన ప్రణీత్ యాదవ్, మోహన్ యాదవ్, బంటి, నాగరాజును మంగళవారం జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యువత సాహసం గొప్పదన్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టీ నలుగురిని రక్షించడం గొప్ప విషయమన్నారు. వారి ధైర్య సాహసాలను మెచ్చుకుని శాలువాతో సన్మానించి సత్కరించారు.

సంబంధిత పోస్ట్