అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు ఒక్క ఎంపీ టికెట్ కూడా ఇవ్వకుండా సీఎం రేవంత్రెడ్డి మాదిగలను అణగదొక్కుతున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు. హైదరాబాద్ విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో వంగపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్దిచెబుతామని హెచ్చరించారు.