సీఎం జగన్కు అధికారం ఇస్తే తల లేని మొండెంలా ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేశారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఫైర్ అయ్యారు. "ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలని సీఎం అంటున్నారు. ఫ్యాన్ స్పీడ్ 1,2,3 లేదా నాలుగులోనే ఉండాలి. మనం దాన్ని 151లో పెట్టాం. దీంతో మన ఇంటి పైకప్పు లేచిపోయింది. గోడలు కూలిపోయాయి. ఇకనైనా ఫ్యాన్ స్పీడ్ తగ్గించాలి." అని రాజానగరం ప్రచార సభలో ఆమె పేర్కొన్నారు.