సిఐ లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఎసిబి డిఎస్పీ

74చూసినవారు
బాలనగర్ డిసిపి పరిధిలోని సురారం పోలీస్ స్టేషన్ పై ఎసిబి అధికారులు దాడి చేశారు. రత్నాకర్ సాయిరాజ్ అనే వ్యక్తి పై గాజులరామారంలో ఓ భూ తగదా విషయంలో కేసు నమోదైంది. సాయిరాజ్ కి సిఐ వెంకటేశం ఫోన్ చేసి 5లక్షల రుపాయలు ఇస్తే ఈ కేసు నుండి రిమూవ్ చేస్తానని చెప్పడంతో భాదితుడు సిఐతో 3లక్షలకు భేరం కుదుర్చుకుని 2లక్షల రుపాయలు ఇచ్చాడని, మిగతా 1లక్ష ఇస్తుండగా పట్టుకున్నామని ఎసిబి డిఎస్పి ఆనంద్ కుమార్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్