రంగారెడ్డి: హైదర్ షాకోట్ లో దారుణం

65చూసినవారు
రంగారెడ్డి: హైదర్ షాకోట్ లో దారుణం
రంగారెడ్డి జిల్లా హైదర్ షాకోట్ లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో నిద్రిస్తున్న భార్యను భర్త శ్రీనివాస్ సుత్తితో కొట్టి చంపేశాడు. గత కొంత కాలంగా భార్యను టార్చర్ చేసేవాడని కుటుంబ సభ్యులు పలుమార్లు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోకపోవడంతోనే హత్య జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. భార్యను చంపి అనంతరం పిల్లలతో పోలీస్ స్టేషన్ కు వెళ్ళి భర్త శ్రీనివాస్ లొంగిపోయాడు.

సంబంధిత పోస్ట్