రాంగోపాల్ పేట డివిజన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు యాసిన్ సోమవారం రాత్రి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డివిజన్ నాయకులతో కలిసి మంగళవారం నల్లగుట్టలోని వారి నివాసానికి వెళ్లి యాసిన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం యాసిన్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. పార్టీ తరపున అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు.