జీహెచ్ఎంసీలో కలిస్తే కంటోన్మెంట్ కు నష్టమే

61చూసినవారు
జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం అయితే ఆ ప్రాంతానికి లాభం కన్నా నష్టమే ఎక్కువ అని కంటోన్మెంట్ బోర్డ్ మెంబర్ రామకృష్ణ సోమవారం బోర్డు కార్యాలయంలో స్పష్టం చేశారు. భవన నిర్మాణాలకు కొంత మెరుగు ఉంటుంది తప్ప మిగతా విషయంలో నష్టం జరుగుతుందన్నారు. జీహెచ్ఎంసీ పూర్తి నష్టాల్లో ఉందని అలాంటి దాంట్లో కంటోన్మెంట్ ను విలీనం చేస్తే ఎలా డెవలప్ అవుతుందని ప్రశ్నించారు. ఇక్కడ ఉన్న స్థలాల కోసమే విలీనం అంటున్నారన్నారు.

సంబంధిత పోస్ట్