బోయిన్ పల్లి పీఎస్ పరిధిలో హోలీ రోజున జరిగిన ఘటనలో వేరు వేరు కుటుంబాలకు చెందిన ఆకాష్ రాజ్, శివనందిని మృతి చెందిన విషయం తెలిసిందే. నిర్లక్ష్య డ్రైవింగ్ తో మృతికి కారణమైన లారీడ్రైవర్ తో పాటు నిబంధనలు పాటించని లారీ యజమాని, కేబుల్ సంస్థ ఫ్లైఓవర్ కాంట్రాక్టర్ కూడా దోషులేనని విచారణలో తేలింది. వీరిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు డీసీపీ రోహిణీ ప్రియదర్శిని తెలిపారు.