ఇవాళ అద్వానీకి భారతరత్న అవార్డును ఇవ్వనున్న రాష్ట్రపతి

63చూసినవారు
ఇవాళ అద్వానీకి భారతరత్న అవార్డును ఇవ్వనున్న రాష్ట్రపతి
దేశంలో వివిధ రంగాల్లో సేవలందించిన మహానీయులకు భారతరత్న పురస్కారాలను నిన్న కేంద్రం అందజేసిన సంగతి తెలిసిందే. అయితే సీనియర్ రాజకీయ నేత LK అద్వానీ అనారోగ్య కారణాల దృష్ట్యా బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో నేరుగా అద్వానీ ఇంటికే రాష్ట్రపతి ముర్ము వెళ్లి ఇవాళ ఉ. 11 గంటలకు ఆయన నివాసంలోనే ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతితో పాటు ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు వెళ్లనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్