సికింద్రాబాద్ నగరంలోని పలు బస్టాండ్లు మందుబాబులకు ఆవాసాలుగా మారుతున్నాయి. చిలకలగూడ బస్ స్టాప్ లో శుక్రవారం మిట్ట మధ్యాహ్నం తోపుడు బండిపై మామిడిపళ్లు అమ్ముకునే వ్యక్తి, మరో మహిళ ఇరువురు బస్టాప్లోనే మద్యం సేవించారు. ఈ విషయాన్ని ఓ నెటిజన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. చిలకలగూడ పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.