తార్నాక డివిజన్ పరిధిలోని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం మే డే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించి కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. కార్మికులు తమ పని గంటలను తగ్గించాలని పోరాటం చేసి విజయం సాధించిన అమరవీరులకు గుర్తు చేసుకుంటూ మే డే వేడుకలు జరుపుకుంటామని తెలిపారు.