ముత్యాలమ్మ ఆలయాన్ని పరిశీలించిన ఎంపీ ఈటల

81చూసినవారు
సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని శ్రీ ముత్యాలమ్మ ఆలయాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుడి కేసు వివరాలను ఏసీపీ సర్దార్ సింగ్, స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు ఆయనను కలిశారు. నిందితుడికి కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్