వృద్ధుడి ప్రాణం తీసిన మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం!

11574చూసినవారు
హైదరాబాద్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. టోలిచౌకి పరిధి ఆదిత్యనగర్లో మెట్రో వాటర్ వర్క్స్ పనుల నిమిత్తం తీసిన గుంతలో పడి వృద్ధుడు మృతి చెందాడు. ఆదివారం నమాజ్ చేసుకొని స్కూటీ మీద వస్తున్న మహమ్మద్ అదుపు తప్పి గుంతలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలు అయ్యాయి. కుటుంబీకులు ఆస్పత్రికి తరలించాగా.. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్