అనుమానాస్పద స్థితిలో కూతురుతో కలిసి తల్లి భవనంపై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. భీమవరానికి చెందిన మానస (30) తన భర్త, కూతురితో కలిసి రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని మైహోం అవతార్లో నివాసం ఉంటున్నారు. భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆదివారం రాత్రి కూతురు కృషి(3)తో కలిసి 18వ అంతస్తుపై నుంచి దూకి మానస ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి సోదరుడు ఆమె వెన్నునొప్పితో బాధ పడుతున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.