రంగారెడ్డి: అక్రమ సంబంధం ఓ మహిళ హత్యకు దారి తీసింది. షాబాద్ మండలానికి చెందిన తొంట సంతోష(30) తన భర్త చనిపోవడంతో సద్దుల సత్తయ్య(33)తో వివాహేతరబంధాన్ని కొనసాగిస్తోంది. సత్తయ్య సెలబ్రేట్ వెంచర్లో వాచ్మెన్గా పని చేస్తున్నాడు. కొంతకాలంగా మనస్పర్థలు రావడంతో ఆమెను వెంచర్ దగ్గరికి పిలిపించుకొని కర్రతో కొట్టి హత్యచేసి వాగులో పాతిపెట్టాడు. ఆమె కొడుకు ఫిర్యాదుతో సత్తయ్యను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.