పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

52చూసినవారు
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
మల్లాపూర్ డివిజన్ పరిధిలో ఓల్డ్ మల్లాపూర్ లోని డివిజన్ వార్డ్ కార్యాలయం పైన రెండవ అంతస్థుకు 33 లక్షల రూపాయలతో దుర్గనగర్ కాలనీలో 60 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మరెడ్డి, కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ ఇంజనీరింగ్ అధికారులు డి ఈ రూపా, ఏఈ శ్రవంతి, స్థానిక నాయకులు, వివిధ కుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్