లోక్ అదాలత్ లో మొత్తం 88 కేసులు పరిష్కారం

80చూసినవారు
లోక్ అదాలత్ లో మొత్తం 88 కేసులు పరిష్కారం
లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కొడంగల్ మున్సిఫ్ కోర్టు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి బీ. శ్రీరామ్ తెలిపారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. రాజీ మార్గమే రాజ మార్గంగా కేసులు పరిష్కరించుకోవాలన్నారు. లోక్ అదాలత్లో మొత్తం 88 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్