విద్యుత్ లేక అవస్థలు.. పట్టించుకోనని అధికారి

79చూసినవారు
మహమ్మదాబాద్ మండల పరిధిలోని ముందలితండాలో గత మూడు రోజులుగా విద్యుత్ లేక తాండవాసులు అవస్థలు పడుతున్నారు. బాగు చేయించిన విద్యుత్ నియంత్రికను బిగించేందుకు సిబ్బంది రాకపోవడంతో మండల కేంద్రంలోని విద్యుత్ ఉపకేంద్రం వద్ద నిరసన తెలిపారు. ఏఈ, లైన్ మ్యాన్ కు ఫోన్ చేసిన స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం త్రాగడానికి కూడా నీళ్లు లేవని, సంబంధిత అధికారులు స్పందించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్