ప్రముఖ సినీ గాయని, పద్మభూషణ్ గ్రహీత పి.సుశీల ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం (ఆగస్టు 19) చెన్నైలోని కావేరి ఆస్పత్రి నుంచి నేరుగా ఇంటికి చేరుకున్నారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్నా అని ఓ వీడియో ద్వారా సుశీల తెలిపారు. అభిమానుల ప్రార్థనలే తనను రక్షించాయని పేర్కొన్నారు. తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో వస్తోన్నవదంతులను ఎవరూ నమ్మవద్దని అభిమానులను కోరారు.