కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకి కీలక పదవి

52చూసినవారు
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకి కీలక పదవి
ఆసియా-పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఛైర్మన్‌గా టీడీపీ నేత, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న 2వ ఆసియా-పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్‌లో 40 దేశాల సభ్యులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం తరఫున దక్కిన ఈ గౌరవాన్ని బాధ్యతగా స్వీకరిస్తానని తెలిపారు. విమానరంగాన్ని ప్రజలకు మరింతగా అందుబాటులోకి తెచ్చేందుకు, సభ్యదేశాల మధ్య రవాణాను సులభతరం చేసేందుకు కృషిచేస్తానని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్