నేను ఇంకా నా బెస్ట్ ఇవ్వలేదు: నీరజ్

76చూసినవారు
నేను ఇంకా నా బెస్ట్ ఇవ్వలేదు: నీరజ్
తాను ఇప్పటికీ బెస్ట్ ఇవ్వలేదని భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అన్నారు. మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ తో నీరజ్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. '2016 వరల్డ్ జూ. ఛాంపియన్ షిప్ లో 86.48మీ. త్రో మాత్రమే నన్ను సంతృప్తి పరిచింది. కొన్ని గోల్డ్ మెడల్స్ సాధించినా సంతృప్తి చెందలేదు. నేను 100% ఇచ్చానని అనుకోవట్లేదు' అని అన్నారు. టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ సాధించిన నీరజ్ పారిస్ ఒలింపిక్ కు సిద్ధమవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్