"నేను మొండిదాన్ని, జైలుకు పంపి జగమొండిని చేశారు".. జైలు నుంచి విడుదల అనంతరం ఎమ్మెల్సీ కవిత

2259చూసినవారు
"నేను మొండిదాన్ని, జైలుకు పంపి జగమొండిని చేశారు".. జైలు నుంచి విడుదల అనంతరం ఎమ్మెల్సీ కవిత
దిల్లీ మద్యం పాలసీ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి విడుదల అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ "నేను మొండిదాన్ని, జైలుకు పంపి జగమొండిని చేశారు. నేను కేసీఆర్‌ బిడ్డను.. తప్పు చేసే ప్రసక్తే లేదు. నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన పెట్టినవారికి వడ్డితో సహా చెల్లిస్తా" అని కవిత వార్నింగ్ ఇచ్చారు. ఆ సమయం త్వరలోనే రాబోతుంది అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్