ఛత్తీస్ఘఢ్లోని రాజ్నంద్గావ్లో ఆదివారం జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కాషాయ పార్టీ లక్ష్యంగా విమర్శలతో విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు ప్రతిచోటా తమకు 400 స్దానాలు వస్తాయని చెబుతున్నారని, అదే జరిగితే వారు రాజ్యాంగాన్ని మార్చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యున్నత రాజ్యాంగం కోసం దేశంలో ఎంతోమంది గొప్ప వ్యక్తులు తమ జీవితాలను ధారబోశారని ఆమె పేర్కొన్నారు.