వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరిలో కాంగ్రెస్ ను మడతపెట్టి కొట్టుడే అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'కాంగ్రెస్ ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేయకపోతే బొంద పెట్టుడే. రేవంత్ రెడ్డి మాట్లాడే భాషను చూసి జనం అసహ్యించుకుంటున్నారు. రేవంత్లాగా మేము కూడా తిట్టగలం. కానీ, మాకు సభ్యత ఉంది. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తోంది. ఇలా అయినా కాంగ్రెస్ పాలన గురించి ప్రజలకు తెలుస్తోంది.’ అని వ్యాఖ్యానించారు.