బంగ్లాతో గెలిస్తే సెమీస్‌కి భారత్‌!

64చూసినవారు
బంగ్లాతో గెలిస్తే సెమీస్‌కి భారత్‌!
టీ20 ప్రపంచ కప్‌లో సెమీస్‌కి భారత్‌ మరో అడుగు దూరంలో ఉంది. సూపర్-8లో రెండో మ్యాచ్ బంగ్లాదేశ్‌తో ఈనెల 22న కీలక పోరులో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియా సెమీస్‌కు చేరుకోవడం దాదాపు ఖాయమవుతుంది. భారత్-బంగ్లాదేశ్‌ ఇప్పటి వరకు 13 టీ20ల్లో తలపడ్డాయి. ఒక్కసారి మాత్రమే బంగ్లా గెలవగా.. 12 మ్యాచుల్లో టీమిండియా విజయం సాధించింది. గత పొట్టి కప్‌లోనూ భారత్‌ నెగ్గింది.

సంబంధిత పోస్ట్