పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సిల్చర్లో జరిగిన పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ.. ఒకవేళ తాము ఎన్నికల్లో గెలిస్తే, అప్పుడు ఎన్ఆర్సీ, సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని అన్నారు. డిటెన్షన్ క్యాంపులో ఎంత మందిని బంధిస్తారని దీదీ ప్రశ్నించారు. ఈ ఎన్నికలు చాలా భయానకంగా ఉండబోతున్నాయని, గతంలో ఎన్నడు కూడా తాను ఇంత అవినీతి ఎన్నికలను చూడలేదని ఆమె పేర్కొన్నారు.