గత కొంత కాలంగా పలు కారణాలతో అకౌంట్లో నుంచి ఆటోమేటిక్గా బ్యాంకులు డబ్బులని కట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఇన్సూరెన్స్ ప్రీమియం కింద ప్రభుత్వ బీమా పథకాల పేరుతో బ్యాంకులు డబ్బులని కట్ చేస్తున్నాయి. ఎస్బీఐ కస్టమర్లకే ఈ సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది వరకు కూడా కస్టమర్లు ఇలాంటి ఫిర్యాదులు చేసారు. దీని పై ఎస్బీఐ స్పందించింది. https://crcf.sbi.co.in/ccf లింక్ ద్వారా నేరుగా కస్టమర్లు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది.