తెలంగాణలో నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోయినప్పుడు తక్షణ పరిహారం అందించేలా చర్యలు చేపడుతున్నట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపీ తెలిపారు. ప్రభుత్వం త్వరలో అసెంబ్లీలో ఈ బిల్లు పెట్టే అవకాశం ఉందన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఖరీఫ్ సీజన్ లో రైతుల డిమాండ్ కు అనుగుణంగా ఆయా రకాల విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నామని, ఎరువులు కూడా సరిపడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.