కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ సీనియర్ నేత కనకమేడల రవీంద్ర మరో లేఖ రాశారు. "సీఎం జగన్పై రాయి దాడి కేసులో బొండా ఉమాను ఇరికించేందుకు యత్నినిస్తున్నారు. బొండా ఉమా పోటీ చేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఎంపై రాయి దాడి ఘటన తర్వాత ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై ఈసీ వెంటనే జోక్యం చేసుకోవాలి." అని లేఖలో ఆయన విజ్ఞప్తి చేశారు.