హర్యానాలో దారుణం.. బీఫ్‌ తిన్నాడన్న అనుమానంతో కొట్టి చంపారు

52చూసినవారు
హర్యానాలో గో రక్షాదళ్‌ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. బీఫ్‌ తిన్నాడన్న అనుమానంతో బెంగాల్‌కు చెందిన వలస కార్మికుడిని కొట్టిచంపారు. చర్కీ దాద్రీ జిల్లా బాంద్రా గ్రామంలో ఈ ఘటన జరిగింది. సాబీర్‌ మాలిక్‌పై దాడికి పాల్పడ్డ ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. హర్యానా ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది. ఆగస్ట్ 27న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులను శిక్షించాలని బాధితుడి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్