సైబరాబాద్ పరిధిలో పోలీసులు భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తీసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమిన్ ప్రీత్ సింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 35 లక్షల రూపాయల విలువ చేసే సుమారు 2.6 కిలోల కొకైన్తో పాటు 2 పాస్పోర్టులు, 10 ఫోన్లు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ దందా వెనుక చాలామంది సినీ ప్రముఖులు ఉన్నట్లు సమాచారం.