హైదరాబాద్ లో మద్యానికి బానిసై వేధిస్తున్న భర్తను చున్నీతో ఉరి వేసి చంపిన భార్య

602చూసినవారు
హైదరాబాద్ లో మద్యానికి బానిసై వేధిస్తున్న భర్తను చున్నీతో ఉరి వేసి చంపిన భార్య
మద్యానికి బానిసై వేధిస్తున్న భర్తని భార్య హత్య చేసిన సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అస్సాం రాష్ట్రానికి చెందిన అలీ హుస్సేన్(35) కుటుంబంతో కలిసి హఫీజ్ పేట్ ప్రేమనగర్ లో నివాసముంటున్నాడు. అలీ హుస్సేన్ భవన నిర్మాణ పనులకు వెళ్తూ వచ్చిన డబ్బులతో నిత్యం మద్యం తాగి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి తాగి వచ్చి భార్యను కొట్టడంతో సహనం కోల్పోయిన ఆమె చున్నీతో భర్త మెడకు ఉరి బిగించి హత్య చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్