బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అక్కడి పార్లమెంటు దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్లో భారత సంతతి హవా కొనసాగింది. దాదాపు 26 మంది భారత మూలాలున్న అభ్యర్థులు అక్కడి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఇక తెలుగు సంతతికి చెందిన చంద్ర కన్నెగంటి, ఉదయ్ నాగరాజులు మాత్రం తాజా ఎన్నికల్లో ఓడిపోయారు. బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో గెలుపొందిన భారత సంతతి అభ్యర్థుల్లో రిషి సునాక్ ముందున్నారు. రిచ్మండ్ అండ్ నార్తర్న్ అలర్టన్ స్థానం నుంచి ఆయన మరోసారి గెలుపొందారు.