విజయవాడలో 50 ఆవులు సహా నలుగురు వ్యక్తులను కాపాడి వరదలో కొట్టుకుపోయిన యువకుడు మృతి

57చూసినవారు
విజయవాడలో 50 ఆవులు సహా నలుగురు వ్యక్తులను కాపాడి వరదలో కొట్టుకుపోయిన యువకుడు మృతి
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో విజయవాడ నగరం జలమయమైంది. ఈ క్రమంలో సింగనగర్ లో డెయిరీ ఫాం నిర్వహించే చంద్రశేఖర్ అనే యువకుడు ప్రాణాలకు తెగించి వరదలో చిక్కుకున్న 50 ఆవులతో పాటు నలుగురు వ్యక్తులను కాపాడాడు. ఈ క్రమంలోనే కాలుజారడంతో చంద్రశేఖర్ వరదలో కొట్టుకుపోయి మృతి చెందాడు. కాపాడపడ్డ వారిలో తన ఇద్దరు సోదరులతో పాటు మరో ఇద్దరు ఉన్నారు. చంద్రశేఖర్ మృతదేహం ఘటనాస్థలానికి 500 మీటర్ల దూరంలో దొరికింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్