బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల కొనసాగుతోంది. పది గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 770 పెరిగి రూ. 73,420కు చేరుకుంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 700 పెరిగి రూ. 67,300 వద్ద కొనసాగుతోంది. వెండి ధర సైతం పైకి ఎగబాకింది. కేజీ వెండి ధర 18,00 పెరిగి రూ. 93,500 పలుకుతోంది. ఏపీ, తెలంగాణలోని అన్ని చోట్లా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.