భారత్ ఆలౌట్‌.. ఉప్పల్ టెస్ట్ ఇంగ్లాండ్‌దే

1042చూసినవారు
భారత్ ఆలౌట్‌.. ఉప్పల్ టెస్ట్ ఇంగ్లాండ్‌దే
హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్‌ తో జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఘోర పరాభవం చవిచూసింది. 231 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమ్ ఇండియా 202 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో భారత టాపార్డర్‌, మిడిలార్డర్‌ విఫలమయ్యింది. కానీ, అశ్విన్(28), భరత్(28) మళ్లీ భారత్ గెలుపు దిశగా తీసుకెళ్లారు. చివరికి వారు కూడా ఔట్ కావడంతో భారత్ ఓటమి ఖరారైంది. దీంతో ఉప్పల్ టెస్ట్ లో ఇంగ్లాండ్ గెలిచింది.

సంబంధిత పోస్ట్