ఢిల్లీలో జూన్ 1(శనివారం)న ఇండియా కూటమి ఆల్ పార్టీ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. కూటమిలోని అన్ని పార్టీల ఫలితాలకు నాలుగు రోజుల ముందు ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానం పంపినట్లు సమాచారం. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ బెయిల్ గడువు జూన్ 2న ముగియనుంది. అంతకంటే ముందుగానే సమావేశం నిర్వహించాలని భావించి.. 1వ తేదీని ఖరారు చేసినట్లు కూటమి వర్గాలు చెప్తున్నాయి.